ఏపీలో 161కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 161కి చేరిందని వైద్య ఆఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో ప్రకటించింది. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9గంటల వరకు కొత్తగా 12 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరు 8, విశాఖలో 3 ఉన్నాయి. జిల్లాల వారిగా కరోనా కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురంలో 2, చిత్తూరు-9, తూర్పుగోదావరి-9, గుంటూరు-20, కడప-19, కృష్ణా-23, కర్నూలు-1, నెల్లూరు-32, ప్రకాశం-17, విశాఖపట్నం-14, పశ్చిమగోదావరిలో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.